Jun 29, 2026, 08:06 IST/
స్పెయిన్లో తెలంగాణ విద్యార్థి మృతి
Jun 29, 2026, 08:06 IST
స్పెయిన్లోని వేలెన్సియా నగరంలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా కూనారం గ్రామానికి చెందిన గీట్ల సాయి అఖిల్ రెడ్డి (30) ఆదివారం రాత్రి భవనం పైనుండి పడి మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.