விளாத்திகுளம் - Vilathikulam

வீடியோஸ்


కరీంనగర్ జిల్లా
కమలాపూర్ లో బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల
Aug 15, 2026, 11:08 IST/ధర్మపురి
ధర్మపురి

కమలాపూర్ లో బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

Aug 15, 2026, 11:08 IST
ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన ఆవునూరి లావణ్య నివాసానికి చేరుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన కుమ్మరి కవిత కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.