మరిన్ని కథలు
మీ జిల్లాను సెలెక్ట్ చేయండి
అనంతపురం జిల్లా

ఐదేళ్ల నరకాసురపాలననుంచి రాష్ట్రం విముక్తి చెందింది: ఎమ్మెల్యే
Jun 19, 2026, 16:06 IST/అనంతపురం
అనంతపురం

ఐదేళ్ల నరకాసురపాలననుంచి రాష్ట్రం విముక్తి చెందింది: ఎమ్మెల్యే

Jun 19, 2026, 16:06 IST
ఐదేళ్ల నరకాసుర పాలన నుంచి రాష్ట్రం విముక్తి చెంది రెండేళ్లు పూర్తయిందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. అర్బన్ టీడీపీ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బైక్ పై నగర వీధుల్లో ప్రదర్శనగా సభా స్థలి వద్దకు చేరుకున్నారు. నీలం రాజశేఖర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సభలో ఇన్ ఛార్జి మంత్రి టీజీ భరత్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు.

ఉద్యోగాలు