తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు మంగళవారం శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 95,498 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,231 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.63 కోట్లు వచ్చింది.