AP: నవంబర్ నుంచి యూనిట్కు 13 పైసలు తగ్గిస్తున్నామని, రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీల భారం ఇంకా తగ్గుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండా స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి.. ఆ భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. ఐదేళ్లలో 9 సార్లు ఛార్జీలు పెంచిందని మండిపడ్డారు.