రాజస్థాన్లోని అతిపెద్ద ఉప్పునీటి సాంభర్ సరస్సు మధ్యలో 1,700 ఏళ్ల నాటి శాకంబరీ మాత ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా ఆకుకూరలు, కూరగాయలను సమర్పించడం ప్రత్యేకత. ఏటా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఉప్పునీటితో చుట్టూ ఉన్నప్పటికీ, ఆలయ పరిసరాలు నిత్యం పచ్చదనంతో కళకళలాడుతుండటం ఇక్కడి విశేషమని స్థానికులు చెబుతున్నారు.