AP: దీపావళి పండుగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 19వ తేదీ ఆదివారం వారాంతపు సెలవు కాగా, 20వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు వచ్చింది. దీంతో విద్యార్థులు దీపావళి జోష్లో ఉన్నారు. అదేవిధంగా, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వీక్ ఆఫ్తో కలిపి మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో వారు సొంత ఇళ్లకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకునే పనిలో ఉన్నారు.