తిరుమలలో శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఆక్టోపస్ భవనం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 74,636 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు వచ్చింది.