కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా 24 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ తాజా ఎన్నికలతో రాజ్యసభలో ఎన్డీయే బలం మరో మూడు సీట్లు పెరగగా,
కాంగ్రెస్ ఒక స్థానాన్ని అదనంగా దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్డీయే చెరో నాలుగు సీట్లను క్లీన్ స్వీప్ చేయగా, కర్ణాటకలో
కాంగ్రెస్ మూడు స్థానాలను,
బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. కాగా, జార్ఖండ్, మిజోరం రాష్ట్రాల్లోని మిగిలిన 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18వ తేదీన
ఎన్నికలు జరగనున్నాయి.