AP: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో శనివారం ఉ.5.30 నుంచి 8.30 గంటల మధ్య మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించనున్నారు. వర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం (ఈసీఈ)లోని 34 మంది విద్యార్థులు, సీహెచ్ కావ్య, కె.శరత్ కుమార్ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. లాంచ్ప్యాడ్గా గ్రీన్ఫీల్డ్ క్యాంపస్లోని క్రికెట్ మైదానాన్ని ఉపయోగిస్తున్నారు.