AP: ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నారా లోకేష్ ప్రకటించడాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చరిత్రాత్మకమని కొనియాడారు. ఈ నిర్ణయంతో దేశంలోనే మహిళలకు అత్యంత గౌరవమిచ్చే పార్టీగా టీడీపీ నిలిచిందని ఆయన అన్నారు. మహానాడు వేదికగా ఈ ప్రకటన చేసినందుకు సీఎం చంద్రబాబు, లోకేష్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.