ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి T20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 20 బంతుల్లో 3 సిక్సులు, 6 ఫోర్లతో హాఫ్ సెంచరీతో చెలరేగారు. ఇక ఇదే మ్యాచ్లో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. T20ల్లో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 5 హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్గా నిలిచారు. అలాగే అంతర్జాతీయ T20ల్లో 100 సిక్సులు కూడా పూర్తి చేసుకున్నారు.