AP: ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పట్టుబడ్డ 50 మంది మావోయిస్టులను కఠిన భద్రతతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు తరలించారు. ఈ తరలింపుకు సంబంధించి ఐదు జిల్లాల ఎస్పీలు, రేంజ్ ఐజీలు కమాండ్ రూమ్కు చేరుకున్నారు. మావోయిస్టుల వద్ద నుంచి రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మ్యాగ్జైన్స్, మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్స్, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలు ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.