అమెరికా-ఇజ్రాయెల్ దళాలు చేపట్టిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ జరిపిన దాడుల్లో సుమారు 6008 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుండి జరిగిన ఈ దాడుల్లో ఇరాన్తో పాటు హిజ్బుల్లా కూడా పాల్గొన్నాయి. గత 24 గంటల్లో 232 మంది ఆసుపత్రిలో చేరగా, గత నాలుగు వారాల్లో 15 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు, ఇజ్రాయెల్-అమెరికా బలగాల ఆపరేషన్ వల్ల ఇరాన్లో 1900 మంది మరణించారని, 20 వేల మంది గాయపడ్డారని అంతర్జాతీయ రెడ్క్రాస్ పేర్కొంది.