AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు పంచాయతీ సంఘం వలస గ్రామ సమీపంలో కాఫీ తోటల్లో నిల్వ ఉంచిన 749 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నాని నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్లో పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.3.45 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.