వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి భారీ ఊరట లభించింది. బెయిల్ షరతుల గడువు నేటితో ముగియడంతో ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కోర్టు షరతులతో బెయిల్ ఇచ్చింది. ప్రతి శనివారం గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం చేయాలని ఆదేశించింది. దీంతో రెండు నెలల పాటు కొడాలి నాని పీఎస్ లో సంతకాలు చేశారు.