భారతదేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై ఉత్తరాఖండ్కు చెందిన ఒక యువతి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. రెడ్డిట్లో తన అనుభవాన్ని పంచుకున్న ఆమె, ఢిల్లీలో సాయంత్రం 8 గంటలకే ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉందని, లేదంటే తెలియని భయం వెంటాడుతుందని పేర్కొంది. కేవలం నేరాలే కాకుండా, పురుషుల చూపులు, వెలుతురు లేని రహదారులు తనలో అభద్రతను పెంచుతున్నాయని, దీనివల్ల ఎంతో మంది యువతులు తమ కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛను త్యాగం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్ట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.