భారతీయ ఆధార్ వినియోగదారుల కోసం UIDAI ఒక వినూత్న మార్పును తీసుకువచ్చింది. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న mAadhaar యాప్ స్థానంలో మరింత సురక్షితమైన, వేగవంతమైన 'ఆధార్ యాప్'ను ప్రవేశపెట్టింది. జులై 1 నుండి 6 నెలల పాటు ఆధార్ సెంటర్కు వెళ్లకుండానే యాప్ ద్వారా ఉచితంగా ఈమెయిల్ అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని UIDAI అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్ చిరునామాను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఫేస్ ఆథెంటికేషన్, QR కోడ్ ఆధారిత సురక్షిత షేరింగ్, బయోమెట్రిక్ లాక్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ యాప్ డిజిటల్ ఐడెంటిటీ కార్డుగా కీలక పాత్ర పోషించనుంది.