APలో అవినీతి నిర్మూలన దిశగా ఏసీబీ చర్యలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 120 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన అధికారులు, ప్రజల నుంచి అవినీతి ఫిర్యాదులు పెరగడంతో ఈ చర్యలు ప్రారంభించారు. బుధవారం ఎన్టీఆర్, ఏలూరు, కోనసీమ, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, శ్రీ సత్యసాయి జిల్లాల్లో సోదాలు జరిగాయి. ఇప్పటివరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు.