AP: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో స్వామివారి మూలవిరాట్ వీడియోను యూట్యూబర్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. ఈ వ్యవహారంపై ఆలయ ఈవో త్రినాథరావు స్పందిస్తూ, డ్యూటీలో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. ఏఈఓ, సూపరింటెండెంట్, సెక్యూరిటీ సీఎస్ఓలకు సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు. వీడియో తీసిన యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.