హంగేరీలో శాస్త్రవేత్తలు ఏఐ డ్రోన్ల సాయంతో కలుపు మొక్కలను గుర్తించి, వాటిపైనే పురుగుమందులు పిచికారీ చేసే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ 'సైట్-స్పెసిఫిక్ వీడ్ మేనేజ్మెంట్' టెక్నాలజీతో మొత్తం పొలానికి మందు కొట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం కలుపు మొక్కలు ఉన్న చోటే స్ప్రే చేయడం వల్ల రైతులకు ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా, పురుగుమందుల వాడకం తగ్గి పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. డీప్ లెర్నింగ్ అల్గారిథమ్లతో 98 శాతం కచ్చితత్వంతో కలుపు మొక్కలను గుర్తించవచ్చు.