విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు తగ్గడంతో, అంతర్జాతీయ విమాన టికెట్లపై విధించిన ఇంధన సర్ఛార్జీని ఎయిరిండియా కొంతమేర తగ్గించింది. ముడిచమురు ధరలు పశ్చిమాసియా యుద్ధానికి ముందు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ఫలితంగా
అమెరికా, ఐరోపా,
ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) దేశాలకు వెళ్లే విమాన టికెట్ల ధరలు తగ్గుతున్నాయి. జులై 1 నుంచి
అమెరికా-
ఆస్ట్రేలియా విమానాల్లో సర్ఛార్జీని 280 డాలర్ల నుంచి 200 డాలర్లకు, ఐరోపా-యూకే విమానాల్లో 205 డాలర్ల నుంచి 125 డాలర్లకు తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.