అయోధ్య రామ మందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో, బద్రీనాథ్ ధామ్లోనూ అలాంటి పుకార్లు వ్యాప్తి చెందాయి. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అంతర్గత విచారణకు ఆదేశించింది. నిధుల దుర్వినియోగంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు బీకేటీసీ ప్రెసిడెంట్ హేమంత్ ద్వివేది తెలిపారు.