తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ జరగలేదని బుకాయిస్తున్న వైసీపీ నాయకులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని కూటమి నాయకులు హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాదవ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. లడ్డూ విషయంలో సీబీఐ నివేదిక ఆధారంగా ఏక సభ్య కమిషన్ను వేసి, అవసరమైతే కోర్టులోనూ అదనపు సమాచారాన్ని జోడిస్తామని పేర్కొన్నారు. తప్పు చేసి ప్రజల దృష్టిని మరల్చేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, దోషులను శిక్షిస్తామని అన్నారు.