అల్లూరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య పొలం వద్దకు, అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని సూచించారు. పులి జాడ తెలిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని, పులి దాడిలో పశు సంపదను కోల్పోతే తక్షణమే పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రజలు అటవీశాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.