మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరకు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన రేపు ఉదయం 10 గంటలకు అరకు చేరుకుంటారు. ఆయన పర్యటించే మార్గాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణం అవుతారు.