చింతూరు మండలం తులసిపాక సమీపంలో బుధవారం రాజమహేంద్రవరం నుంచి చింతూరు వెళ్తున్న గూడ్స్ లారీ (CG 18S 8034) ప్రమాదవశాత్తు దగ్ధమైంది. లారీ వెనుక టైర్ల నుంచి వచ్చిన నిప్పురవ్వలు మంటలుగా మారి వాహనాన్ని పూర్తిగా దహనం చేశాయి. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, పూర్తి వివరాల కోసం విచారణ చేపట్టారు.