అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జి.మాడుగుల మండలం పెదలోచల పంచాయతీ ఇండుగుల గ్రామంలో మౌలిక సదుపాయాల లోపం కారణంగా ఒక గిరిజన మహిళ అడవి మార్గంలో ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇండుగుల గ్రామం నుండి తారు రోడ్డు వరకు మూడు కిలోమీటర్ల రహదారి సౌకర్యం లేకపోవడంతో గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రసవించింది.