
విశాఖ: డ్రగ్స్తో దొరికిన చరణ్
బెంగళూరు నుంచి విశాఖ వస్తున్న చరణ్ అనే యువకుడిని ఆదివారం ఈగల్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద నుంచి 36 ఎల్ఎస్డీ స్ట్రిప్స్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, ఈ స్ట్రిప్స్ను వైఎస్సార్సీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండా రెడ్డి కోసమే తీసుకువస్తున్నట్టు వెల్లడైంది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు అనంతరం కొండా రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖలో డ్రగ్స్ వ్యాప్తిపై ఆందోళన రేకెత్తిస్తోంది.





































