పాడేరు మండలంలోని 12వ మైలు గ్రామంలోని బస్ షెల్టర్ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. చుట్టుపక్కల పెరిగిన తుప్పల కారణంగా మందుబాబులు మద్యం బాటిళ్లను అక్కడే వదిలివేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. బస్ షెల్టర్ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.