
ఓయూ డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల మూడు, అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 14వ తేదీ వరకు కళాశాలల్లో చెల్లించవచ్చు. రూ.500 అపరాధ రుసుముతో 17వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉంది. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ను సంప్రదించవచ్చు.




