చింతూరు మండలం మద్దిగూడెం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బొలెరో వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొని బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులకు ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన కూలీలు కావడంతో రెండు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు.