అల్లూరి జిల్లాలో చమురు కొరత లేదని కలెక్టర్ దినేష్ కుమార్ పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ, గిరిజన ప్రాంత ప్రజలు పెట్రోల్, డీజిల్ కొరత భయంతో మంగళవారం తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. అడ్డతీగల బంక్లో పెట్రోల్ కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అధికారులు మాత్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చమురు కొరత లేదని భరోసా ఇస్తున్నారు.