ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభ ముందుకొచ్చింది. ఈ బిల్లుపై మధ్యాహ్నం ఒంటి గంటకు చర్చ ప్రారంభమవుతుందని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. సుమారు రెండు గంటలపాటు ఈ చర్చ కొనసాగనుంది. ఈ బిల్లు ఇప్పటికే బుధవారం లోక్సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.