AP: అమరావతి రెండో విడత భూసేకరణలో రైతులకు మిక్స్డ్ యూజ్ రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. తొలిదశలో వాణిజ్య, నివాస ప్లాట్లు వేర్వేరుగా కేటాయించడం వల్ల భూమి చిన్న ముక్కలుగా మారి కేటాయింపుల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఈసారి భూమి ఒకే పార్సిల్గా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మిక్స్డ్ యూజ్ నిర్మాణాలకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) కీలకం కానున్న నేపథ్యంలో, ప్రభుత్వం దానిపై కూడా దృష్టి సారించింది.