హర్ హర్ మహాదేవ్ నామస్మరణతో అమర్నాథ్ యాత్ర శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్రలో తమకు కేటాయించిన తేదీకి ముందు ఏ యాత్రికుడినీ అనుమతించబోమని జమ్ముకశ్మీర్ యంత్రాంగం శుక్రవారం స్పష్టం చేసింది. ప్రజలు తమకు నిర్దేశించిన తేదీన మాత్రమే ప్రయాణించాలని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం 3,800 మందికి పైగా యాత్రికులతో కూడిన రెండో బృందం జమ్ము బేస్ క్యాంపు నుంచి బయలుదేరింది.