AP:
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కాంట్రావర్సీకి కేరాఫ్గా మారారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటుగా విమర్శలు చేసే అంబటి.. ఈ సారి కేంద్ర మంత్రిపై పెట్టిన ఒక పోస్టు వివాదాస్పదమైంది. ఈ ఇష్యూపై
టీడీపీ నేత ఫిర్యాదుతో అంబటిపై కేసు కూడా నమోదైంది. అయితే అంబటి చేసిన సెటైరికల్ పోస్టుపై పొలిటికల్ హైప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అంబటి చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారంటూ
టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.