ఏపీ హైకోర్టులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిగింది. రిమాండ్ చట్టవిరుద్ధమని, కేసును కొట్టివేయాలని అంబటి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.