రాత్రి కురిసిన భారీ వర్షానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ జలమయమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి వర్షానికే కాంప్లెక్స్లోకి నీరు చేరుతుండగా, భారీ వర్షాలు కురిస్తే లోపలికి వెళ్లే పరిస్థితి కూడా ఉండదని స్థానికులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించి, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.