దేవరాపల్లి మండలంలో వలసల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాలాబు, గరిసింగి పంచాయతీల గిరిజనులు, రైవాడ కూలీలు ఉపాధి కోసం తూర్పు గోదావరి జిల్లాకు వలస వెళ్తున్నారు. స్థానికంగా ఉపాధి లభించక 'పొట్ట చేత పట్టుకుని' వలస బాట పట్టాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఉపాధి పనులు ప్రారంభించి జీవనోపాధి భరోసా కల్పించాలని వారు కోరుతున్నారు.