అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలోని హుకుంపేట మండలం కోట్నాపల్లి పంచాయతీ మారెల గ్రామంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ డా. సియ్యారి దొన్ను దొర ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితా సవరణపై అవగాహన కల్పించారు. అర్హులైన ఎవరికీ ఓటర్ల జాబితాలో నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పొరపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు.