నర్సీపట్నం జైలులో ఉన్న పాస్టర్ అభినయ్ దర్శన్, రాజకీయ లబ్ధి కోసం తనపై తానే దాడి చేయించుకుని కట్టుకథలు సృష్టించిన కేసులో గురువారం ఉదయం బెయిల్పై విడుదలయ్యారు. విచారణలో నిజాన్ని నిర్ధారించిన పోలీసులు ఇటీవల ఆయనను అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం అభినయ్ దర్శన్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.