పరవాడ రామ్ కీ ఫార్మా సిటీలో సోమవారం, ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ పంకజ్ కుమార్ ద్వివేది, ఈగల్ ఎస్పీ నగేశ్ బాబు పర్యవేక్షణలో ఐదు కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 1108 కిలోల గంజాయిని కాలుష్య నియంత్రణ ప్రమాణాల ప్రకారం ఇన్సినరేషన్ ప్లాంట్లో ధ్వంసం చేశారు. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రమే లక్ష్యంగా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.