అనంతపురం జిల్లా - Ananthapur

ధర్మవరం |

చర్చిపై దాడిని ఖండించిన పాస్టర్లు, దోషులపై కఠిన చర్యలకు డిమాండ్

పోతుకుంట గ్రామంలో చర్చిపై జరిగిన దాడిని ఖండిస్తూ ధర్మవరం పట్టణంలోని ఎస్‌ఐయూ చర్చిలో జిల్లా వ్యాప్తంగా పాస్టర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అభినయ్ జిల్లా పాస్టర్లు, మైనారిటీ అధ్యక్షులు శర్మ, పాస్టర్లు, నాయకులు శ్రీనివాసులు, సాకే వినయ్ తదితరులు పాల్గొన్నారు. చర్చిపై దాడిని మత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించిన వారు, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అంశాన్ని ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

వీడియోలు


ఆంధ్రప్రదేశ్
వస్త్ర వ్యాపారం తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు!
Jan 20, 2026, 07:01 IST/

వస్త్ర వ్యాపారం తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు!

Jan 20, 2026, 07:01 IST
ఉద్యోగం వెతుకుతూ విసిగిపోయిన వారికి, తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించగల వస్త్ర వ్యాపారం ఒక చక్కని అవకాశం. సాధారణంగా రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల పెట్టుబడితో షాప్ ప్రారంభించవచ్చు. బెంగళూరులోని చిక్కపేట్, ఢిల్లీలోని గాంధీనగర్ వంటి హోల్‌సేల్ మార్కెట్లలో నాణ్యమైన దుస్తులు తక్కువ ధరకు లభిస్తాయి. నెలకు 300 మంది కస్టమర్లు వస్తే, ఒక్కో కస్టమర్‌కు రూ. 200 లాభంతో నెలవారీ ఆదాయం రూ. 60 వేలు, ఖర్చులు పోను రూ. 30 వేలు నికర లాభం వస్తుంది. ఏడాదికి సుమారు రూ. 4 లక్షల లాభం ఆర్జించే అవకాశం ఉంది. సరైన ప్రణాళిక, మార్కెటింగ్, ఆన్‌లైన్ అమ్మకాలతో వ్యాపారం వృద్ధి చెందుతుంది.