ఆదివారం , దసరా పండుగ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి దంపతులు ఆర్పీలకు చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్పీలతో సమావేశం నిర్వహించి, 'పీఎం సూర్య ఘర్' పథకంపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో సోలార్ పవర్ ఉండాలన్నది ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు లక్ష్యమని, దీనికి ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. ఆర్పీలు మహిళా సంఘాల ద్వారా ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.