అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఆర్. డబ్ల్యూ. ఎస్ అధికారులతో తాగునీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలపై చర్చించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతిని కూడా సమీక్షించారు.