అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
పుట్లూరు మండలం కొత్తపల్లికి చెందిన పెండేల పవన్ కుమార్ నాయుడు(21) గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో ఉన్న పీపీ సవనీ యూనివర్సిటీలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సూరత్కు బయలుదేరి వెళ్లారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.