కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులచే ఘనంగా స్వాగతం అందుకున్న ఆయన, స్వామి వారి ఎదుట కార్తిక దీపం వెలిగించారు. టిడిపి నాయకులు, శ్రేయోభిలాషులతో కలిసి అమ్మవారి దర్శనం అనంతరం, ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.