బైక్ కొనివ్వలేదని క్షణికావేశంలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తాడిపత్రి మండలం చల్లవారిపల్లి సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుడు టైలర్స్ కాలనీకి చెందిన నాగేంద్ర, కళావతి దంపతుల కుమారుడు సాయికిరణ్(21)గా రైల్వే పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.