అనంతపురం జిల్లాలో మూడున్నర దశాబ్దాల పాటు నిబద్ధతతో సేవలందించి, ఇటీవల పదవీ విరమణ పొందిన ట్రాఫిక్ ఏఎస్సై సత్యనారాయణ, గార్లదిన్నె ఏఎస్సై మహబూబ్ బాషాలను స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. వారి సేవలను ఎస్పీ కొనియాడారు.